UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 రకుల్ ప్రీత్ సింగ్‌కి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ

డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల్ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే ఓ సారి విచారణకు హాజరైన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. బెంగళూరులో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి రకుల్‌కి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు హైద్రాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారణను ఎదుర్కొన్నారు.

ఓ రాజకీయ ప్రముఖుడితో.. రకుల్.. తెలంగాణకి చెందిన రాజకీయ ప్రముఖుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా నోటీసులు పంపిన ఈడీ, అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా నోటీసులు పంపడం చర్చనీయాంశమయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ – రోహిత్ రెడ్డిలకు ఎలా ఈ డ్రగ్స్ లింకుపై సంబంధాలున్నాయి.? అన్న విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నోటీసులు అందాయనీ, ఏ కేసులోనో ఇంకా తెలియదని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. మరోపక్క, రకుల్ ప్రీత్ సింగ్ ఇంతవరకు ఈ డ్రగ్స్ కేసులో నోటీసుల వ్యవహారంపై స్పందించలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !