UPDATES  

 రకుల్ ప్రీత్ సింగ్‌కి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ

డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల్ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే ఓ సారి విచారణకు హాజరైన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. బెంగళూరులో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి రకుల్‌కి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు హైద్రాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారణను ఎదుర్కొన్నారు.

ఓ రాజకీయ ప్రముఖుడితో.. రకుల్.. తెలంగాణకి చెందిన రాజకీయ ప్రముఖుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా నోటీసులు పంపిన ఈడీ, అదే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా నోటీసులు పంపడం చర్చనీయాంశమయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ – రోహిత్ రెడ్డిలకు ఎలా ఈ డ్రగ్స్ లింకుపై సంబంధాలున్నాయి.? అన్న విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నోటీసులు అందాయనీ, ఏ కేసులోనో ఇంకా తెలియదని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. మరోపక్క, రకుల్ ప్రీత్ సింగ్ ఇంతవరకు ఈ డ్రగ్స్ కేసులో నోటీసుల వ్యవహారంపై స్పందించలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !