UPDATES  

 18 పేజెస్… అల్లు అర్జున్ మెయిన్ గెస్ట్‌గా రాబోతున్నట్లు అనౌన్స్

కార్తికేయ-2 తర్వాత నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 19న హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఓ స్పెషల్ వీడియో ద్వారా అల్లు అర్జున్ మెయిన్ గెస్ట్‌గా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో నిఖిల్‌తో పాటు నటుడు అభినవ్ కనిపించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 17న రిలీజ్ చేయబోతున్నారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన కార్తికేయ -2తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు నిఖిల్‌. కృష్ణతత్వానికి అడ్వెంచర్ అంశాలను మేళవించి దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా 130 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత వస్తోన్న 18 పేజెస్ సినిమాపై టాలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !