UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 తెలుగుదేశం (telugudesam party) పార్టీ వల్లే తెలంగాణ (telangana) అభివృద్ధి

తెలుగుదేశం (telugudesam party) పార్టీ వల్లే తెలంగాణ (telangana) అభివృద్ధి సాధించిందని… ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్ లో పుట్టిన టీడీపీ పేదల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని అభివృద్ధి చేశామని… ఇప్పుడదే నగరం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఆవిర్భవించిందని చెప్పారు. 25 ఏళ్ల దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన పునర్ నిర్మాణ సభలో పాల్గొనేందుకు వెళుతూ…. కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. నాయకన్ గూడెం వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

వేలాదిగా విచ్చేసిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవమని బాబు అన్నారు. ప్రతి గ్రామం లో ఆ మహనీయుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకులు జరుపుకుంటున్న సందర్భంలోనే టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం టీడీపీ వల్లే వచ్చిందని చెప్పారు. రైతులు, పేదల పిల్లలను ఐటీ నిపుణులుగా చేశామని గుర్తుచేశారు. నాడు తాను సెల్ఫోన్ గురించి మాట్లాడితే అంతా హేళన చేశారని.. ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. టీడీపీ అందించిన ఐటీ అభివృద్ధిని అందుకుని… నేడు మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని వెల్లడించారు. అనంతరం… ఖమ్మం ఇల్లెందు క్రాస్ రోడ్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న తెలంగాణ టీడీపీ పునర్ నిర్మాణ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.

తెలంగాణలో పూర్వ వైభవమే లక్ష్యంగా.. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సభ విజయంతం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ సభ ద్వారా కేడర్ లో ఉత్తేజం నింపి, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకుంటామని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !