UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 మళ్లీ వివాదాస్పదం అయిన తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌

తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు మరో సారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంతో వివాదాస్పతుడైన శ్రీనివాసరావు తాజాగా కరోనా వ్యాప్తి తగ్గించింది ఏసు ప్రభువు అంటూ వ్యాఖ్యలను చేశారు. ఏసు ప్రభు వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని లేదంటే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యేవి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాల నుండి కోవిడ్ మానవ జాతి మనగడకు ప్రశ్నార్ధకంగా మారింది. ఆ మానవ జాతి హానికరమైన కోవిడ్ ని ఏసు ప్రభు కృపతో తరిమి కొట్టారు అంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏసు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని ఆయన అన్నారు. మంచిని ఆచరించాలని.. మంచిని ప్రేమించాలని.. మంచిని గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. ఒక ఐఏఎస్ అయిన శ్రీనివాసరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారంను రేపుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !