UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 పవన్‌పై జగన్‌ విమర్శలు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్న జనసేన

వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం రాజకీయంగా దూకుడు పెంచిన జనసేన అధినేత పవన్‌పై కొన్నాళ్లుగా కక్షసాధింపు చర్యలకు దిగిన ఏపీలోని వైసీపీ సర్కార్‌ కొన్ని రోజులుగా దూకుడు తగ్గించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూ మధ్య మొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంది. వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని పవన్‌ ప్రకటించగానే జగన్‌ కోపం రెట్టింపైంది. అంతే ఇక తాను పాల్గొనే ప్రతీ సభలోనూ, కార్యక్రమంలోనూ చంద్రబాబుతో సమానంగా పవన్‌ కళ్యాణ్‌ పై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టేశారు జగన్‌. ఆయన్ను చూసి వైసీపీ నేతలు కూడా పవన్‌పై విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా కాపు నాడు భేటీ, రంగా వర్ధంతి నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా వెనక్కితగ్గినట్లు కనిపిస్తోంది.

Pawan Kalyan- JAGAN పవన్‌పై జగన్‌ విమర్శలు ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీతో కలిసి పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. గత ఏడాది కాలంలో దూకుడు మరింత పెంచారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ సభ నుంచి మొదలుపెట్టి వైసీపీపై పవన్‌ తన దాడి ముమ్మరం చేశారు. దీంతోపాటు మళ్లీ చంద్రబాబువైపు మొగ్గడం మొదలుపెట్టారు. దీంతో సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు కూడా సందర్భంతో సంబంధం లేకుండా పవన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. పవన్‌ కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ వర్సెస్‌ చంద్రబాబు కంటే జగన్‌ వర్సెస్‌ పవన్‌ వారే ఎక్కువయ్యేలా ఉందన్న చర్చ కూడా జరిగింది. తగ్గిన వైసీపీ దూకుడు? అయితే పవన్‌ కళ్యాణ్‌ విశాఖ టూర్‌ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన్ను టార్గెట్‌ చేసిన వైసీపీ, ప్రధాని పర్యటనలో పవన్‌కు దక్కిన ప్రాధాన్యత, రాష్ట్రంలో మారుతున్న రాజకీయం నేపథ్యంలో దూకుడు తగ్గించింది. పవన్‌పై నిత్యం ఏదో ఒక విషయంలో విమర్శలకు దిగే పేర్నినాని, కొడాలి, అమర్నాథ్‌ వంటి నేతలు కూడా కొంతకాలంగా సైలెంట్‌ అయ్యారు. మధ్యలో వారాహి వాహనంపై విమర్శలు చేసినా త్వరగానే వాటి నుంచి వెనక్కితగ్గారు. సీఎం జగన్‌ కూడా సభల్లో పవన్‌ పై తీవ్ర విమర్శలు చేయడం లేదు. దీనంతటికీ ఓ కీలక కారణం కనిపిస్తోంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !