UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ కీలక మలుపు

నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది.! తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయస్థానం, సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా ఈ వ్యవహారం నడిచింది. ఆయన్ని ఓ ఇద్దరు స్వామీజీలు, ఓ వ్యాపారస్తుడు కలిసి, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేలా డీల్ సెట్ చేశారు.

ప్లేటు మార్చిన రోహిత్ రెడ్డి.. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారానికి సంబంధించి, తన వద్దకు వచ్చినవారిని బురిడీ కొట్టించారు పైలట్ రోహిత్ రెడ్డి . పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని పట్టించారు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేయగా, ఆ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ నిందితులు పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగ ప్రవేశం చేస్తే.. ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వుంటాయో ఏమో.! తెలంగాణ సిట్ బృందం విచారణతో న్యాయం జరగదని నిందితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !