UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి తాజాగా కంటతడి

సినీ నటి, వైసీపీ నేత, ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి తాజాగా కంటతడి పెట్టారు. రోజా కూతురి విషయమై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్. ఆమెది మృదు స్వభావం. కానీ, ఆమె మీద కొందరు వ్యక్తులు ట్రోలింగ్ చేస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు..’ అంటూ రోజా కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన.. ‘నా కుమార్తె విషయంలోనే కాదు.. నా కుటుంబ సభ్యులందరి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు.

నా సోదరులతో నాకు లింకులు పెడుతున్నారు, అసభ్యకరమైన రీతిలో కామెంట్లు చేసి, ట్రోలింగ్ చేస్తున్నారు..’ అంటూ రోజా వాపోయారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌కి అందరూ బాధితులే. రోజా, ఆమె కుటుంబ సభ్యులపై జరుగుతున్న ట్రోలింగ్‌ని ఎవరూ సమర్థించరు. కానీ, రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఆయా నాయకుల వ్యక్తిగత జీవితాలపై రోజా సైతం పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. రాజకీయ నాయకులు చేసే విమర్శలు ముదిరి పాకాన పడ్డంతో, వారిని ఆదర్శంగా తీసుకుంటోన్న అనుచరులు, అభిమానుల వల్లనే సోషల్ మీడియా మరింత దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !