UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఏపీలో ముందస్తు ఎన్నికలకు అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈయన గత కొన్నాళ్లుగా సొంత పార్టీ నాయకులపై మరియు అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నాడు. జగన్ ప్రభుత్వం పై ఆయన అనేక ఆరోపణలు చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ పథకాలు త్వరలో నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

ప్రభుత్వ పథకాలకు ఇచ్చేంత డబ్బు రాష్ట్రంలో లేదని అందుకే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడంటూ ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ మాటను తప్పాడు.. ప్రజలను మోసం చేశాడు అంటూ ఎంపీ ఆరోపించారు. ప్రజల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నాడు. ముందస్తు ఎన్నికలు కు వెళ్లడం తప్పితే జగన్ కి మరో మార్గం లేదని.. అందుకే ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ రఘురామ అంటున్నాడు. మరి వైకాపా నాయకులు ఈ రెబల్ ఎంపీ జోష్యంపై ఎలా స్పందిస్తారని చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !