UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఏపీలో ముందస్తు ఎన్నికలకు అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈయన గత కొన్నాళ్లుగా సొంత పార్టీ నాయకులపై మరియు అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నాడు. జగన్ ప్రభుత్వం పై ఆయన అనేక ఆరోపణలు చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ పథకాలు త్వరలో నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

ప్రభుత్వ పథకాలకు ఇచ్చేంత డబ్బు రాష్ట్రంలో లేదని అందుకే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడంటూ ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ మాటను తప్పాడు.. ప్రజలను మోసం చేశాడు అంటూ ఎంపీ ఆరోపించారు. ప్రజల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నాడు. ముందస్తు ఎన్నికలు కు వెళ్లడం తప్పితే జగన్ కి మరో మార్గం లేదని.. అందుకే ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ రఘురామ అంటున్నాడు. మరి వైకాపా నాయకులు ఈ రెబల్ ఎంపీ జోష్యంపై ఎలా స్పందిస్తారని చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !