UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 తొడకొట్టిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

వైసీపీ నేత, ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తొడకొట్టారు. సొంత జిల్లా శ్రీకాకుళంలోని బూర్జ మండలంలోని పాార్టీ మండల అధ్యక్షుడు కె గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు తమ్మినేని సీతారాం. ‘మళ్ళీ జగన్‌ కే ఓటేస్తామని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఓ మహిళ తొడ కొట్టి చెప్పింది’ అంటూ ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తాను కూడా తొడకొట్టారు. మళ్ళీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని తమ్మినేని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారు..

ఒకప్పుడు నారావారిపల్లెలో రెండెకరాల భూమి మాత్రమే వున్న చంద్రబాబు ఇప్పుడెలా కోట్లకు పడగలెత్తాడంటూ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ‘ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం వుందా.? వుంటే, దాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తే నిరుపేద అంటూ ఎవరు వుండరు’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను పీకేస్తామంటున్నారనీ, వాలంటీర్లను వైకాపా ప్రభుత్వ ఉద్యోగుల కింద త్వరలో ప్రకటన చేయనుందని చెప్పారు తమ్మినేని సీతారాం. చంద్రబాబు గెలవడం కోసం నానా రకాల హామీలు ఇచ్చి, గెలిచాక మాట తప్పడం వల్లే ప్రజలు ఆయన్ని ఓడించారని తమ్మినేని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !