UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 బండి సంజయ్‌ని మార్చం: బీజేపీ అధినాయకత్వం సుస్పష్టం

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బండి సంజయ్ చేజారిపోతోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా బీజేపీలో ఓ వర్గం పావులు కదుపుతోంది. బండి సంజయ్ అతి దూకుడు వల్ల పార్టీ నష్టపోతోందంటూ అధినాయకత్వానికి కొందరు బీజేపీ తెలంగాణ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, బండి సంజయ్‌ని మార్చబోవడంలేదనీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోదనీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.

విభేదాలొద్దు.. కలిసి పనిచేయండి.. పార్టీలో అంతర్గత విభేదాలకు తావు లేదనీ, తెలంగాణ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ ముఖ్య నేతలకు తరుణ్ చుగ్ సూచించారు. అధినాయకత్వం నిర్ణయం మేరకు, బండి సంజయ్‌తో కలిసి పని చేసి, బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మీద ఇతర పార్టీలు పన్నుతోన్న కుట్రల్నీ, చేస్తున్న అసత్య ప్రచారాల్ని తిప్పి కొట్టాల్సిందిగా తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !