UPDATES  

 నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి05 : ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… మద్దుకూరు గ్రామానికి చెందిన కుంజా రామక్రిష్ణ, క్రిష్ణవేణి దంపతులకు నాలుగేండ్ల కుమారుడు జర్షల్ (సన్ని), ఏడాదిన్నర శాన్వి కుమార్తె కలదు. రామక్రిష్ణ చర్చి పాస్టర్ కాగ, భార్య క్రిష్ణవేణి ఇంటి వద్ద సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తారు. గురువారం మధ్యాహ్నం అన్నపురెడ్డిపల్లి మండలం భీమునిగూడెం గ్రామంలో జరిగే విందుకు భార్యభర్తలు కలిసి వెళ్లారు. కుమార్తె శాన్వి నాయనమ్మ లక్ష్మి దగ్గర ఉంచి వెళ్లారు. సుమారు నాలుగున్నర గంటల సమయంలో ట్యూషన్కు వచ్చిన పిల్లలతో కలిసి కుంజా శాన్వి ఆటలాడుతుండగా, నాయనమ్మ ఇంట్లో పనిలో నిమగ్నమైంది. గంట సమయం గడిసిన తరువాత చిన్నారి శాన్వి కనపడకపోవడంతో తోటి పిల్లలను అడగ్గా ఇక్కడే ఆడుకుందని చెప్పగా, ఎంత వెతికిన కనపడకపోవడంతో ఊరులో వెతికి
దిగాలుగా ఎదురు చూసే సమయంలో తల్లి దండ్రులు రామక్రిష్ణ. క్రిష్ణవేణిలు వచ్చి శాన్వి కనపడకపోయిన విషయాన్ని తెలుసుకొని ఆందోళన పడ్డారు. ఈ క్రమంలో పక్క ఇంటిలోని నీటి తొట్టిలో పడి ఉన్న విషయాన్ని గమనించి, హుటహుటిన కొత్తగూడెం తరలించగా, అప్పటికే చిన్నారి చనిపోయిన విషయాన్ని వైద్యులు దృవీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !