UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై. అవును.. చంద్రబాబు మరణాల అంకెలతో తనకు తాను పాపులారిటీ లెక్కలు వేసుకుంటున్నారంటూ ఆరోపించారు. కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను ఆయన ఉదాహరణగా తీసుకొని ఆర్జీవీ మాట్లాడారు. ఇలాంటి సందర్భాలు హిట్లర్ తర్వాతనే చంద్రబాబును చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అసలు పెద్ద గ్రౌండ్స్ లో సభలు పెడితే ఎవరు వస్తారు.. జనాలు ఎవరూ రారు. తనకు మద్దతు లేదని అనుకుంటారు.. అందుకే ప్రజలకు ఆశ పెట్టి జనం ప్రాణాలతో చెలగాటం ఆడారు.. అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారంటూ ఆర్జీవి మండిపడ్డారు.

బిస్కెట్ల ఎర వేసి ప్రజలను గుంటూరు సభకు రప్పించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఫోటోలకు పోజులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు జనం రద్దీగా ఉంటే ఏం చేయాలో తెలియదా? ఏం జరుగుతుందో తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రజల గురించి తెలియదా?  ప్రజలకు బిస్కెట్ల ఎర వేసి జనాలను చంద్రబాబు రప్పించారు ఏం పరిస్థితులు ఉన్నాయో తెలియదా? సభలకు జనాలను రప్పించడం కోసం.. ఎరలు వేసి రప్పించుకుంటున్నారు. అసలు సభలకు వస్తే కానుకలు వస్తాయి అనే కాన్సెప్ట్ ను ప్రారంభించిందే చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు ఆర్జీవీ. జనాల మరణాలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తన పాపులారిటీకి కొలమానంగా భావిస్తున్నారు అంటూ ఆర్జీవీ ఫైర్ అయ్యారు. సందుల్లో సభలు పెట్టి, ఏవో ఇస్తామని జనాలను రప్పిస్తే ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఇంత అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !