UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పై అగ్రెసివ్‌ గా ఎటాక్ చేస్తున్న బండి సంజయ్ మరో వైపు ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్తున్న విషయం తెల్సిందే. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బండి సంజయ్ తీర్థ యాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా శృంగేరి లోని శ్రీ శారదా పీఠం లో జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారిని బండి సంజయ్‌ దర్శించుకున్నారు.

శారదా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందు ఉండాలి అంటూ జగద్గురువులు బండి సంజయ్ కి తెలియజేసినట్లుగా బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే బండి సంజయ్ మరోసారి యాత్ర నిర్వహించే ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థి బండి సంజయ్ అంటూ ఆ పార్టీలో కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సీఎం అవ్వాలని బండి సంజయ్ ఆరాటపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !