UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఈ ఏడాది చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పై అగ్రెసివ్‌ గా ఎటాక్ చేస్తున్న బండి సంజయ్ మరో వైపు ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్తున్న విషయం తెల్సిందే. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బండి సంజయ్ తీర్థ యాత్రలు కూడా చేస్తున్నారు. తాజాగా శృంగేరి లోని శ్రీ శారదా పీఠం లో జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారిని బండి సంజయ్‌ దర్శించుకున్నారు.

శారదా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందు ఉండాలి అంటూ జగద్గురువులు బండి సంజయ్ కి తెలియజేసినట్లుగా బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే బండి సంజయ్ మరోసారి యాత్ర నిర్వహించే ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థి బండి సంజయ్ అంటూ ఆ పార్టీలో కొందరు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సీఎం అవ్వాలని బండి సంజయ్ ఆరాటపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !