UPDATES  

 తెలంగాణకి కేంద్రం తీపి కబురు.!కంటోన్మెంట్ కష్టాలు తీరనున్నాయ్..!

తెలంగాణ రాష్ట్రానికి.. అందునా, గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కీ.. అదునా, కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు సాగించే హైద్రాబాదీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సాధారణ పౌరులు సంచరించేందుకు పరిమితులున్నాయి. కొన్ని చోట్ల అనుమతుల నిరాకరణ జరుగుతుంటుంది. ఆ ప్రాంతంపై పూర్తిగా కేంద్ర రక్షణ శాఖకే పూర్తి హక్కులున్నాయ్ ఇప్పటిదాకా.

పెరుగుతున్న నగర జనాభా.. అదే పెద్ద సమస్య.. నగర జనాభా విపరీతంగా పెరుగుతోంది.. ఈ క్రమం నగరం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు పెరిగాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ కంటోన్మెంట్ ప్రాంతంలోని రహదార్లను సైతం వెడల్పు చేయలేని పరిస్థితి. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కృషి, అందునా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ సమస్యపై వివరించడంతో.. కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి. కమిటీ నెల రోజుల వ్యవధిలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !