UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 కలిసి కట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి… -కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు.

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 08: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి కట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు అన్నారు. ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి పినపాక నియోజకవర్గ గడ్డ మీద అందరూ కష్టపడి గతంలో లాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచక, నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే పేద,బడుగు బలహీనవర్గాల ప్రజలకు,రైతులకు,నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !