UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ సదస్సుకు సాంబశివరెడ్డికి ఆహ్వానం….

వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ సదస్సుకు సాంబశివరెడ్డికి ఆహ్వానం….

తెలంగాణ రైతు బిడ్డకి జీ 20 దేశాల ప్రతినిధుల పక్కన కూర్చునే అరుదైన గౌరవం….

గొప్ప గౌరవాన్ని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటా….

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మన్యం న్యూస్, మంగపేట.
భారత కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ముంబాయి నగరంలో ఫిబ్రవరి 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వరల్డ్ స్పైసెస్ కాంగ్రెస్ సదస్సుకు హాజరుకావాలని భారత ప్రభుత్వం నుండి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డికి మంగళవారం ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్పైసెస్ కాంగ్రెస్ సదస్సుకు హాజరు కావాలని భారత ప్రభుత్వం నుండి తనకు ఆహ్వానం రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.జి 20 దేశాల ప్రతినిధుల మధ్య కూర్చునే అరుదైన అవకాశం కల్పించటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. తనను ఈ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించిన ఘనత ఈ ప్రాంత రైతులదేనని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సాంబశివరెడ్డి తెలిపారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని తనకు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సాంబశివరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సుగంధ ద్రవ్యాల ఎగుమతి దారులు ప్రాసెసర్సు, కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని సాంబ శివ రెడ్డి తెలిపారు.సాంబశివరెడ్డికి వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ లో పాల్గొనే అవకాశం రావడం పట్ల రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !