మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగసభకు నియోజకవర్గాలవారిగా జనసమీకరణ చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు మంగళవారం తెలిపారు. సంక్రాంతి పండగ లోపే ముందస్తుగా మండలాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇల్లందు నియోజకవర్గం నుండి 50 వేలు , పినపాక నియోజకవర్గం నుండి
10 వేలు, కొత్తగూడెం నియోజకవర్గం నుండి 10 వేలు, అశ్వారావుపేట నియోజకవర్గం నుండి 5 వేలు, భద్రాచలం నియోజకవర్గం నుండి 3 వేల చొప్పున జన సమీకరణ చేయాలని ఆయన నాయకులకు తెలిపారు.
