మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్వంచ పర్యటనను జయప్రదం చేయాలని కోరుతూ బి. ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారంపాల్వంచ పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం పాల్వంచ కెస్పీ రోడ్ లో ప్రారంభమైన ఈ ర్యాలీ నటరాజ్ సెంటర్, శాస్త్రి రోడ్డు,కూరగాయల మార్కెట్,బస్టాండ్ ఏరియా, మార్కెట్ ఏరియాలో ర్యాలీ నిర్వహించారు. పాల్వంచకు మెడికల్ కళాశాలను, కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంజూరు చేసిన నేపథ్యంలో దానికి కృతజ్ఞతగా సీఎంకు ఘన స్వాగతం పలకాల్సిందిగా ప్రజలను నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో డి. సి. ఎం.ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, పట్టణ బి. ఆర్.ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్కేఆర్కే ఆచార్యులు, జడ్పిటిసి బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, బి. ఆర్.ఎస్ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, పూసల విశ్వనాథం, సర్పంచుల సంఘం అధ్యక్షులు భూక్య రవీందర్,బి. ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు బేతంశెట్టి విజయ్,పలువురు సర్పంచులు,ఎంపీటీసీలు, నాయకులు పెండ్యాల కృష్ణమూర్తి, కందుకూరి రాము, దారా చిరంజీవి, నారకట్ల రాజశేఖర్, జె.దుర్గాప్రసాద్, సందు ప్రభాకర్, సంతోష్ రెడ్డి(బబ్లు), నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
