మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 11: తెలంగాణ రాష్టం ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18 న ప్రారంభం కానుంది, ఈ కార్యక్రమం గురించి పంచాయతీ సర్పంచులు, సెక్రటరీలు, ఆరోగ్య శాఖ సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఉచితంగా పరీక్షలు చేసి తగిన కళ్లద్దాలు అందిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమం 6 నెలలు కొనసాగుంది, కంటి పరీక్షలు చెపించుకోవలిసిన వారికి ఇలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాటు చేయాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవతం చేయటానికి కృషి చేయాలని సర్పంచ్ లకి, సెక్రటరీ లకి, ఆరోగ్యం శాఖ అధికారులకుతగిన సూచనలు అందించారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీవో వివేకారామ్, ఎంపిఓ సునీల్ శర్మ, మోరంపల్లి బంజర్ ప్రాధమిక ఆరోగ్యం కేద్రం అధికారి డాక్టర్, స్పందన, బూర్గంపహాడ్ సర్పంచ్ సిరిపురపు స్వప్న, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి, వేపలగడ్డ సర్పంచ్ కుంజ చిన్నబ్బాయి, తాళ్ల గోమ్మూరు సర్పంచ్ కొయ్యల పుల్లారావు, కృష్ణ సాగర్ సర్పంచ్ కొదిమే వెంకటేశ్వర్లు. బూర్గంపహాడ్ మండల సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
