UPDATES  

 వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు..

మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10:
వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మణుగూరు మండలంలోని కిన్నెర కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు అత్యధికంగా మహిళలు హాజరై ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ రీజన్ చైర్ పర్సన్ చిత్తలూరు రమేష్ బాబు, ప్రెసిడెంట్ చిట్టూరి శేషు కుమార్, జోన్ చైర్ పర్సన్ దింటకుర్తి బ్రహ్మయ్య లు మాట్లాడుతూ రోజు రోజుకు మారిపోతున్న సాంకేతిక యుగంలో సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి కి మణుగూరు వాసవీ క్లబ్ నిర్వహించే సంక్రాంతి ముగ్గుల పోటీకి మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహం పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజన్ చైర్ పర్సన్ చిత్తలూరు రమేష్ బాబు, ప్రెసిడెంట్ చిట్టూరి శేషు కుమార్, జోన్ చైర్ పర్సన్ దింటకుర్తి బ్రహ్మయ్య, పిఆర్ఓ విశ్వనాథ్ గుప్తా, డిస్టిక్ కేసిజిఎఫ్ ఇంచార్జ్ బండారు నరసింహారావు, వనితా వైభవం ప్రెసిడెంట్ చిట్టూరి నాగరత్నమణి, రీజియన్ సెక్రెటరీ చిత్తలూరి ఉమా, కన్నా రాకేష్ , వాసా ప్రసాద్, ఇందుమతి, స్వర్ణ, మానస, స్వప్న, మాధవి, ధనలక్ష్మి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !