మన్యం న్యూస్, సారపాక :
కెసిఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహిముద్ ఖాన్ అన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… కెసిఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చే ముందు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని అన్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కెసిఆర్ నెరవేర్చలేదని అన్నారు. గిరిజనులకు పోడు భూమి పట్టాలుఇవ్వలేదని, అలాగే నిరుద్యోగ భృతి, భద్రాచలం కు 100 కోట్లు ఇలా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలి ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు కేసీఆర్ వస్తున్నారు అని మండిపడ్డారు. జిల్లా ప్రజలకు ముందు క్షమాపణ చెప్పిన తర్వాతే జిల్లాలోకి రావాలని ఆయన పేర్కొన్నారు.