మన్యం న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి గురువారం మధ్యాహ్నం విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,విప్,బీఆరెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు, లోకసభ బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,తాతా మధు, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులతో కలిసి ఘన స్వాగతం పలికారు.భద్రాచలం వెళ్లే రోడ్డులో నూతనంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి విప్ రేగా కాంతరావు పుష్పగుచ్ఛం అందజేసి హార్థిక స్వాగతం చెప్పారు.అలాగే,కేసీఆర్ గారికి స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ హరిసింగ్ నాయక్,మెచ్చా నాగేశ్వరరావు,రాములు నాయక్,జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య,మాజీ ఎమ్మెల్సీలు పూల రవీందర్,బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా కలెక్టర్ అనుదీప్,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం తదితరులు ఘన స్వాగతం పలికారు.హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి,లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులంతా హెలిప్యాడ్ నుంచి బస్సులో కలెక్టరేట్ చేరుకున్నారు.ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో, అర్చకులు వేద మంత్రాలు చదువుతూ కేసీఆర్ గారికి అపూర్వ స్వాగతం పలికారు, పోలీసుల గౌరవం వందనం స్వీకరించారు.అనంతరం గుమ్మడి కాయ, కొబ్బరికాయలు కొట్టి వేద మంత్రోచ్ఛరణాల మధ్య సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
