ఖమ్మం నుండే శంఖారావం ఈ గడ్డే నన్ను కడుపుల పెట్టుకుని కాపాడింది కొత్తగూడెం జిల్లా కు.. ఇంకా వస్తాయి జిల్లా అభివృద్ధి కి సీఎం కేసీఆర్ వరాల జల్లు (మన్యంన్యూస్ ప్రతినిధి బృందం) దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచి శంఖారావాన్ని పూరించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఈ సంది మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును సీట్లో కూర్చోబెట్టి సీఎం ఆశీర్వదించారు. జిల్లా పర్యటన సందర్భంగా సీఎం జిల్లాకు పలు వరాలు కురిపించారు. జిల్లాలోని 481 గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు 40 కోట్లు.. మణగూరు, ఇల్లందుకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మైనింగ్ ఇన్సిటిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజీగా మారుస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామని చెప్పారు. మొత్తంగా సీఎం పర్యటన సూపర్ హిట్ కాగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ఆకర్షణగా మారారు. మంత్రి పువ్వాడ, రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు లకు సీఎం ప్రాధాన్యం ఇచ్చారు. ……..
