UPDATES  

 రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి

మన్యం న్యూస్, భద్రాచలం టౌన్ :

భద్రాచలం రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో మువ్వా దమయంతి అధ్యక్షతన గురువారం వివేకానంద స్వామికి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం సిఐ పింగళి నాగరాజు రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట తిరుపతి లు హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిదాత అని, దేశ ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !