మన్యం న్యూస్ ,పినపాక: అపదలో మేము ఉన్నామంటూ,భాదితలకు అండగా నిలుస్తూ.మనో ధైర్యాన్ని నింపుతున్నారు.బిటిపియస్ ఇంజనీర్లు హెల్పింగ్ హ్యాండ్స్ అంటే మానవత్వానికి మరో పేరుగా నిలుస్తున్నారు.పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామానికి చెందిన అడపా పద్మ , కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది.అ కుటుంబాన్ని విది వక్రికరించి,అమెను క్యాన్సర్ మహమ్మారి రూపంలో జీవితాన్ని చిదిమేసింది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో, హైదరాబాదు అస్పత్రికి తీసుకువెళ్ళడంతో క్యాన్సర్ వ్యాధి అని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో అప్పులు చేసి మరి అమెకు కూతురు వైద్యం చేపించింది.ఇటీవల అమె పరిస్థితి విషమించడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెంటనే హైదరాబాదు తీసుకువెళ్ళాలని తెలిపారు. వెంటనే ఆమె ను హైదరాబాదు లోని క్యాన్సర్ ఆసుపత్రి కి తరలించారు. ఆసుపత్రిలో జాయన్ చేసినా,వైద్యానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడటంతో ,ఈ విషయాన్ని బిటిపియస్ హెల్పింగ్ హ్యండ్స్ కు తెలపడటంతో,వారు వెంటనే స్పందించి బిటిపియస్ సి.ఈ బిచ్చన్న, ఇంజనీర్లు సహయంతో ,మణుగూరు కు చెందిన స్వచ్చంద సేవకుడు గూడూరు క్రిష్ణ రెడ్డి,భాదితురాలు కూతురు అయన సాయిలక్ష్మికి పోన్ పే ద్వారారూ.10వేల అర్దిక సహయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.
సహయం చేసినా వారికి రుణపడి ఉంటా:భాదితురాలు కూమర్తె
మా అమ్మ వైద్యానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ అత్యవసర సమయంలో అర్దిక సహయం అందించినా,బిటిపియస్ హెల్పింగ్ హ్యండ్స్ కు,సి.ఈ బిచ్చన్న,స్వచ్చంద సేవకుడు గూడూరు క్రిష్ణ రెడ్డి కి, ఎంతో రుణపడి ఉంటామని భాదిత కుటుంబరాలు,కూమర్తె సాయిలక్ష్మి తెలిపారు.
