మన్యం న్యూస్ ,బూర్గంపహాడ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రానున్న సందర్భంగా మండలంలోనీ భారతీయ జనతా పార్టీ కి చెందిన నాయకులను ,ప్రజాప్రతినిధులనుపోలీసులు ముందస్తు గా అరెస్టు చేసి బూర్గంపాడు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టులలో మండల అధ్యక్షులు బీరకా సాయిశ్రీను, రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డీ, జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామ్ నాయక్, మోరంపల్లి బంజార సర్పంచ్ భూక్యా దివ్య శ్రీ లు ఉన్నారు.కాగా ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులను ముందర ముందస్తు అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
