మన్యం న్యూస్, బూర్గంపాడు జనవరి 12:
మండల కేంద్రంలో గల జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో కొనసాగుతున్న యూసఫ్ 15వ మెమోరియల్ కప్ లో మొదటి మ్యాచ్ దుర్గా 11 శ్రీధర వర్సెస్ సతీష్ 11 లక్ష్మిపురం తలపడగ మొదట బ్యాటింగ్ చేసిన దుర్గా 11 శ్రీధర జట్టు తమ నిర్ణీత 10 ఓవర్లలో 55 పరుగులు ఆలౌట్ అనంతరం 56/10 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సతీష్ 11 జట్టు లక్ష్మీపురం జట్టు 8.1 ఓవర్లలో 57/4 పరుగులు చేసి విజయం సాధించారు. సతీష్ 11 జట్టు ఆటగాడు సందీప్ 2 ఓవర్లు వేసి 9 పరుగులు ఇచ్చి తన ఖాతాలో 5 వికెట్లు వేసుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. ఈ అవార్డునీ ముఖ్య అతిథిగా విచ్చేసిన బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నవీన్ అందజేశారు. ఈ కార్యక్రమం లో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గొనేల నాని,అబ్దుల్ సలీం,భజన సతీష్,పాషా ఉన్నారు.
