మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 13: మణుగూరు లో ప్రభుత్వం మంజూరు చేసిన పాలిటెక్నిక్ కాలేజ్ కోసం శుక్రవారం సర్వే నిర్వ హించారు. మండలంలోని గుట్ట మల్లారం ప్రాంతంలో రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం నరసింహారావు, మణుగూరు సర్వేయర్ తిరుపతయ్య, ఆర్ ఐ శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు శ్యామ్, లక్ పతిలు పాల్గొన్నారు
