జిల్లా ప్రజలకు బోగి,సంక్రాంతి శుభాకాంక్షలు
దేశ ప్రజల సంక్షేమమే కేసీఆర్ సంకల్పం
పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి
* విప్,ఎమ్మెల్యే, బీ. ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు, రేగా కాంతారావు *
మన్యం న్యూస్,మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి. ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు భోగి పండుగ ,మకర సంక్రాంతిశుభాకాంక్షలుతెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయాలని కోరారు.అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాని తెలిపారు.’మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
