UPDATES  

 క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకలు … జడ్పిటిసి నాగమణి

మన్యం న్యూస్. ములకలపల్లి జనవరి 13… క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకగా నిలుస్తాయని క్రీడల్లో గెలుపు ఓటమిలో సహజంగా తీసుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుకోవాలని జడ్పిటిసి నాగమణి ఆకాంక్షించారు. శుక్రవారం మండలం లోని పాత గంగారం గ్రామంలో కొమరం భీమ్ , సొయం గంగులు జ్ఞాపకార్ధంగా పాత గంగారం యూత్ కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు. రెండవ రోజు ఆటలో భాగంగా టిపిసిసి మెంబర్, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మంచిగా విజయవంతంగా నిర్వహించాలని క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని నిర్వాహకులకు, క్రీడాకారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఇరప ప్రసాద్, ఉప సర్పంచ్ బాలకృష్ణ, కారం సీతయ్య గూడెం సర్పంచ్ సుధీర్, పోతుగంటి లక్ష్మణ్ , వెలకమ్ వెంకట్ , మడకం రమేష్ వాడే జోగారావు,వాడే శేసాగిరి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !