మన్యం న్యూస్,కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్,బి.ఆర్. ఎస్ భద్రాద్రి జిల్లా కార్యాలయం ప్రారంభించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు, విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యక్తిగత సహాయకులు చందా హరికృష్ణ దొర, కట్వకోజుల వేణు,బి.ఆర్.ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి లు వేరువేరు గా సీఎం కేసీఆర్ కి బీఆరెస్ జిల్లా కార్యాలయం సీఎం కేసీఆర్ ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా వారుసీఎంకి పుష్ప గుచ్ఛం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా వారు శుక్రవారం మన్యం న్యూస్ తో మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
