మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి13.. గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… సంక్రాంతి పండుగను మండల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ కోసం బంధువులు, స్వంత గ్రామాలకు వెళ్లే వారు ఇంటి తాళాలు వేయటంతో పాటు, పోలీసులకు సమాచారం ఇస్తే రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. పేకాట, జూదం, కోడి పండేలు నిర్వహించే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు,అనుమానితులు సంచరిస్తే సమాచారం వెంటనే ఇవ్వాలన్నారు.