UPDATES  

 ఏజెన్సీ ప్రజలకు, అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు -ఐటీడీఏ పీవో పోట్రు గౌతం

మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 14..ఏజెన్సీ ఏరియాలోని మండలాలు గిరిజన గ్రామాలలో పనిచేయుచున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఏజెన్సీ ఏరియా ఆదివాసి గిరిజన కుటుంబాలకు, విద్యార్థిని, విద్యార్థులకు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రు శనివారం సంక్రాంత్రి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ, సంతోషాలు భోగభాగ్యాలతో, విరాసిల్లాలని అలాగే పంటలు సమృద్ధిగా పండి రెట్టించిన ఉత్సాహంతో గిరిజన రైతులు పండుగలు జరుపుకోవడంతో అద్భుతమైన సంతోషాన్ని, ప్రగతిని, ఆరోగ్యాన్ని, ఇవ్వాలని ఆకాంక్షించారు. మకర సంక్రాంతి, కనుమ పండుగ మన గొప్ప సాంస్కృతిక, వారసత్వానికి, ప్రతీకలని సాంప్రదాయమైన సంక్రాంతి ఉత్సవాలు అన్ని వర్గాల గిరిజన కుటుంబాల మధ్య బంధాన్ని పెంచుతాయని అన్నారు. ఇలాంటి శుభ సందర్భంలో ప్రేమ, వాత్సల్యం, స్నేహం, సహోదరత్వం వంటి ఉన్నత ఆలోచనలు అందరిలో కలగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !