మన్యం న్యూస్,అశ్వాపురం: మండలం జగ్గారం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భవాని లింగమంతుల జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం లింగమంతుని జాతర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం యాదవ్ లు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యాదవ సంఘం మండల నాయకులు కోడి అమరేందర్ యాదవ్ మాట్లాడుతూ…
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే శ్రీ శ్రీ శ్రీ భవాని లింగమంతుల జాతరను తరతరాల ఆచార ప్రకారం ముందుకు నడిపిస్తూ జాతరను నిర్వహించడం జరుగుతుందన్నారు. పినపాక నియోజకవర్గం లోని యాదవ సోదరులు అందరూ లింగమంతుని జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేనెల ఫిబ్రవరి 5 నుండి 7 వరకు జరిగే జాతరను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల యాదవ సంఘం అధ్యక్షుడు మారుతి శ్రీనివాస్ యాదవ్,అశ్వాపురం మండల యాదవ సంఘం అధ్యక్షుడు బండారి జనార్ధన్ యాదవ్,ఆలయ కమిటీ అధ్యక్షులు లాంకెల రమేష్ యాదవ్,మణుగూరు, అశ్వాపురం మండలం యదవ పెద్దలు,యువజన యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
