మన్యం న్యూస్ , మణుగూరు, జనవరి 16: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన తిప్పారెడ్డిరామిరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డిల తండ్రి తిప్పారెడ్డి నారాయణ రెడ్డి సోమవారం మృతి చెందారు. ఆయన మండలంలో అందరికి సుపరిచితుడు కావడంతో ఆయన బౌతిక కాయాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. మంగళవారం ఉదయం మొండికుంటలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలియగానే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు , బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు.
