UPDATES  

 జన్మదిన సందర్భంగా 50 కేజీల బియ్యం అమ్మ సేవా సదనం కి వితరణ

జన్మదిన సందర్భంగా 50 కేజీల బియ్యం అమ్మ సేవా సదనం కి వితరణ
యువ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు అమ్మ సేవా సదనంలో ఘనంగా నిర్వహన

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 16:…అశ్వారావుపేట మండల కేంద్రం లో అమ్మ సేవ సదనం వృద్ధాశ్రమంలో యువ నాయకులు, సామాజిక సేవ కార్యకర్త అరేం ప్రశాంత్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రశాంత్ అమ్మ సేవాసదనంకి 50 కేజీల బియ్యం, అరటి పండ్లు అందజేసి వారితో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్బంగా యువ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు భరోసా కల్పించాలని, మీకు ఉన్నంతలో ప్రతి ఒక్కరు సేవ సహాయ కార్యక్రమాలు చేయగలరని కోరారు. అలానే గతంలో వృధాశ్రమo కు స్థలం కేటాయించాలని కలెక్టర్ కి గ్రీవెన్స్ లో వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగిందనీ స్థలం కేటాయించడం జరిగింది కావున స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, పార్లమెంటు సభ్యులునామ నాగేశ్వరావు చొరవ తీసుకొని అమ్మ సేవ సధనం కు నూతన నిర్మాణం ఏర్పాటు చేయాలని తేలియజేస్తు రాబోయే రోజుల్లో మరెన్నే అమ్మ సేవాసదన వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవ సధన వృదాశ్రమ నిర్వాహకురాలు అనసూయ, శిరోమణి, అశ్వారావుపేట నియోజకవర్గం బీఎస్పీ నాయకులు రాయల పోలయ్య, షేక్ నాగు, దినేష్ అశ్వారావుపేట నియోజకవర్గ యువ నాయకులు వాడే. వీరస్వామి, కాక శివశంకర్ ప్రసాద్, కోరెం రమేష్, కుర్సం రవి, ఆశ్రమ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !