మన్యం న్యూస్, దమ్మపేట, జనవరి 16: ఖమ్మంలో బుధవారం జరిగే బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పిలుపునిచ్చారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం వల్ల ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భించిన తర్వాత మొదటి సమావేశం ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరుకున్నారు