మన్యం న్యూస్, మంగపేట:
మండలం లోని నర్సింహా సాగర్ గ్రామం లో బోడ అజయ్, ఊకె అరుణ్ కుమార్, మేరుగు సందీఫ్, మేరుగు వంశీ, మేరుగు సాయి, మేరుగు లక్ష్మి అనే దళితులపై అదే గ్రామనికి చెందిన బీసీ( యాదవులు ) కులానికి చెందిన వ్యక్తులు సంఖ్యలో దళిత వాడలోనికి వచ్చి దళిత,గిరిజనులపై సోమవారం భౌతిక దాడులు చేశారు.మహిళలు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దమనకాండను సృష్టించిన సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని అంబేద్కర్ సంఘం, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల వాడల్లోకి వచ్చి భౌతిక దాడులకు పాల్పడ్డ సంఘటన ఇదే మొదటి సంఘటన. ఇలాంటి సంఘటనలు నేటి సమాజానికి గొడ్డలిపెట్టు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని దళితులను అంటరాని వారిగా, తక్కువ కులంగా దూషిస్తూ దాడులు చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం సీనియర్ నాయకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, గంగెర్ల రాజారత్నం, పళ్ళికొండ యాదగిరి, చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి దికొండ కాంతారావు, ప్రధాన కార్యదర్శి బసరికానీ హరికృష్ణ, కోడెల నరేష్, వెంపెల్లి వీరాస్వామి, రాజమల్ల సుకుమార్, మైప లాలయ్య, తాలూకా సంపత్, నిమ్మగడ ప్రవీణ్,దాసరి ఎల్లయ్య, గుగ్గిళ్ల సురేష్, కర్రీ రామ్ మోహన్, గుంతపూడి తిరుమల, బోడ శ్రీను, మురుకుంట్ల నరేందర్, ఎడ్ల నరేష్, జంగం భాను చందర్,బూర్గుల సతీష్, లంజపెల్లి కిరణ్, బూరుగుల శ్రీశైలం, బోడ సతీష్, చిక్కుల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
