మన్యం న్యూస్, అశ్వాపురం జనవరి 16:అశ్వాపురం మండల పరిధిలోని రామచంద్రపురం పంచాయతీ లో సోమవారం ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు .పంచాయతీ లో పలు బాధితు కుటుంబలకు పరామర్శించి రేగా విష్ణు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు .సత్యనారాయణపురం లోని వల్లపు సాయి కి విద్యుత్ షాక్ కొట్టడం తో వారి దగ్గరకు వెళ్లి పరామర్శించినారు. తెల్లం జోగయ్య ఇటీవల మరణించడం జరిగింది వారు కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోవడం తో భార్య వెంకటరమణ ,పిల్లలను ఓదార్చి అనాధలైన పిల్లలను రేగా విష్ణు ట్రస్టు ద్వారా వారిని చదివించుటకు అభయం ఇచ్చారు. గరిఒడ్డు గ్రామంలో తాటి ఆదిలక్ష్మి ఇల్లు ఇటీవల ప్రమాదశవత్తు అగ్నికి ఇల్లు కాలిపోవడం తో వారి కుంటుంబాన్ని పరామర్శించి వారికి రూ.10,000 వేల రూపాయాలు అందజేశారు వలబోజు బిక్షపతి నిరుపేద కుటుంబానికి రూ. 3500 రూపాయలు ఆర్ధిక సాయం చేశారు. అదే గ్రామం లో రేసు రంగయ్య ఇటీవలే పనిచేస్తూ ఉండగా గోడకూలి మీదపడి నడుము విరగడం తో వారి దగ్గరకు వెళ్లి వారిని పరామర్శించ రూ.10,000 ఆర్ధిక సాయం చేశారు ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ సర్పంచ్ కాకా అశోక్ మొగలి వీరారెడ్డి, పెదవీరారెడ్డి ఉప సర్పంచ్ సురేష్ రెడ్డి సుధీర్ తదితరులు పాల్గొన్నారు