మన్యం న్యూస్ ఏటూరు నాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఐటిడిఏ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో ఈ నెల21న శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు.యూత్ ట్రైనింగ్ సెంటర్ జాకారంలో నిర్వహించే ఈ మేళాకు15 కంపెనీలు హాజరు అవుతున్నాయి. విద్య అర్హతలు పదవ తరగతి, ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ, ఐటిఐ,డిప్లమా,బి ఫార్మసీ,ఎం ఫార్మసీ,డి ఫార్మసీ,ఎంబీఏ, బీటెక్,చదివిన విద్యార్థులకు అవకాశాలు కల్పించబడునని, ఆసక్తి గల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ,యువకులు సర్టిఫికెట్స్ జిరాక్స్ పత్రాలతో హాజరు కాగలరని పి ఓ ఒక ప్రకటనలో తెలిపారు.
