మన్యం న్యూస్ ,నూగురు వెంకటాపురం:
మండల కేంద్రంలో ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం లో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల అధ్యక్షులు కణితి ప్రశాంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వరరావు మాట్లాడుతూ
స్వతంత్రానికి పూర్వం దట్టమైన అటవీ ప్రాంతంలో అడవిలో సహజ సంపదను సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కాయలు, గడ్డలు, దుంపలు, వేర్లు, ఆకులు, తింటూ సహజీవనాన్ని కొనసాగించే వారు, ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతం ఒకప్పుడు అది ఆదివాసీలు మాత్రమే ఉండేవారు. ఆదివాసీల నివాసిత ప్రాంతాల పైన, ఆదివాసీల భూముల పైన, ఆదివాసీల సహజ సంపద పైన, ఆదివాసీలు నివసిస్తున్న సారవంతమైన భూమిని కొల్లగొట్టేందుకు, ఆక్రమించుకునేందుకు, గిరిజనేతరులు కుట్రలు పన్నారనీ ఆయన అన్నారు. గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలోకి వలస వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆదివాసీలు భూమిపై పోరాటం చేస్తూనే ఉన్నారు, అని నిరంతరం భూ పోరాటం చేయడం తో ఆదివాసీల భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఎల్.టి.ఆర్,1/59, 1/70, చట్టాలను సాధించుకున్నారు అని .భూమి అన్యాక్రాంతం కాకుండా భూ చట్టాలు ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి అన్యాక్రాంతం అవుతూనే ఉందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివాసీల చట్టాల జోలికొస్తే క్షమించేది లేదు అంటూ ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, జిల్లా నాయకులు కుచింటి చిరంజీవి, వెంకటకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.
