నాడు ఒంటరిగా స్వరాష్ట్రం కోసం..
నేడు కుటుంబంతో దేశం కోసం బిఆర్ఎస్ సభకు..
మలి దశ ఉద్యమం లో అలుపెరుగని ఉద్యమ కారుడు వేల్పుల నరసింహారావు..
స్వరాష్ట్రంలో తగిన గుర్తింపు రాకున్నా కెసిఆర్ తోనే పయనం..
మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 18…
ఉద్యమమే ఊపిరి గా తెలంగాణ రాష్ట్ర సాధనే జీవితాశయంగా, కేసీఆర్ మాటే వేద వాక్కుగా, ఆయన బాటే రాచబాటగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు సుమారు 14 సం.లు వివాహం సైతం వాయిదా వేసుకొని, ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ప్రతి పిలుపును విజయవంతం చేసిన ఉద్యమ కారుడు, ఆయనే టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, జూలూరుపాడుకు చెందిన వేల్పుల నరసింహారావు అలియాస్ (టీఆర్ఎస్ నరసింహారావు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తరువాత, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించిన సఫలం కాకున్నా, నిరుత్సాహ పడకుండా, పార్టీ వెన్నంటే వుండి ప్రభుత్వ కార్య క్రమాలలో పాల్గొంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత వివాహాం చేసికొని బార్య బిడ్డలతో, కలిసి చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటున్నారు. కేసీఆర్ పిలుపుకు స్పందించి బుధవారం ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుటుంబ సమేతంగా తరలి వెళ్లారు. రైతు రాజ్యం సాధించేందుకు, కేసీఆర్ జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలియజేస్తూ, ఆయన అప్పగించే ఏ బాధ్యత నైన త్రికరణ శుద్ధిగా చేస్తానని తెలియజేశారు.
