UPDATES  

 తారక రాముడు కి ఘన నివాళి… సంక్షేమ పథకాలకు యుగపురుుడు ఎన్టీఆర్ : బచ్చల భారతి

మన్యం న్యూస్,మణుగూరు టౌన్:
మండల పరిధిలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ లో పంచాయితీ ఆఫీస్ ఏరియా లో సర్పంచ్ బచ్చల భారతీ ఆధ్వర్యం లో నిర్వహించిన ఎన్టీఆర్ 27 వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఆంటు తెలుగుజాతి గొప్పతాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పటుబడిన యుగ పురుషుడు స్వర్గీయ ఎన్టీఆర్. అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తాత మాధవి లత, వట్టం నారాయణ, వాసిరెడ్డి చలపతి రావు , పార్టీ సీనియర్ నాయకులు కూచిపూడి బాబు, పసునూరి కృష్ణ, యార్లగడ్డ రాజ, చావా రామారావు, సుబ్బారెడ్డి, నర్సింహ, మహిళ నేతలు పసునూరి సీత, చావా శ్రీదేవి, సరిత, రమ, తెలుగు యువత నాయకులు మేదరమెట్ల శ్రీను, నాగేశ్వర రావు, బచ్చల సుమేష్, శంకర్, శ్రీను, గోపాల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !