మన్యం న్యూస్, గుండాల జనవరి 19.. ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ఎన్నో సంచలనాత్మక కథనాలు అందిస్తున్న మన్యం న్యూస్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రముఖులు ఆకాంక్షించారు గురువారం మన్యం న్యూస్ దినపత్రిక క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. గుండాల తాసిల్దార్ నాగ దివ్య , ఎస్సై కిన్నెర రాజశేఖర్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ సీతారాములు, ప్రాథమిక వైద్యశాల వైద్యులు మనీష్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు .
