మన్యం న్యూస్ వాజేడు. మండలంలో లక్ష్మీపురం గ్రామంలో ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధరణి పోర్టల్ సమస్యలపై అవగాహన కార్యక్రమంలో తహసిల్దార్ గూడూరు లక్ష్మణ్ పాల్గొని ధరణి పోర్టల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లం బుల్లేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
