మన్యం న్యూస్ గుండాల, జనవరి 20.. అదనం కట్నం తేవాలంటూ భార్య తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేసిన సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఐదుగురుపై కేసు నమోదు చేసినట్లు ఆళ్లపల్లి ఎస్సై రతీష్ పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి .కాచన పల్లి గ్రామానికి చెందిన శైలజ కి తన మేనమామ అయిన ఓర్సు రాంబాబుతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రాంబాబు గత కొద్ది రోజులుగా వేరేక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని శైలజ ను తరచు కొడుతున్నాడని శైలజ ఫిర్యాదుల పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం శైలజ కుటుంబ సభ్యులతో కలిసి రాంబాబు ఇంటికి వెళ్లిన సమయంలో రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి శైలజ కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఈ దాడి లో శైలజ కుటుంబ సభ్యులు గాయాలపాల అయినట్టు ఆయన తెలిపారు. శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓర్సు రాంబాబు, మల్లయ్య, రాధా, సారమ్మ, ఎర్ర వెంకన్న పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రతీష్ పేర్కొన్నారు.
