UPDATES  

 కంటి వెలుగుతో ప్రతి ఇంట్లో వెలుగులు…ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ ,చర్ల ,జనవరి20: రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతున్నాయని ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఏది అవసరమో దానిపైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని కంటి సమస్యలతో నేడు ఎన్నో బాధలు పడుతున్న నిరుపేదలకు గొప్ప వరమని కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. అలాగే కంటి వెలుగులో పరీక్షలు చేసే డాక్టర్లకు మంచి శిక్షణ ఇచ్చారు అని మంచి అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని మంచి పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను ఉచితంగా అందజేస్తామన్నామని, ఒకవేళ అందుబాటులో లేని కళ్లద్దాలు ఆర్డర్లపై కేవలం పది రోజులలో అందుబాటులో ఉండేటట్లు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలు ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !