మన్యం న్యూస్, చర్ల, జనవరి 20:
చర్ల మండలంలోని గడింకోట క్రీడా మైదానంలో అంతర్రాష్ట్ర 100 బాల్స్ క్రికెట్ టోర్నమెంట్ ని తెలంగాణ విప్ రేగా కాంతారావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని కొత్త స్నేహ పరిచయాలు క్రీడల ద్వారా ఏర్పడి మానవ సంబంధాలను పెంపొందించుకొనుటకు ఎంతగానో దోహదపడతాయని, శరీర ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని అన్నారు. యువత ఈ క్రీడల ద్వారా తమలో ఉన్న నైపుణ్యాలు వెలికి వస్తాయని అటువైపుగా యువత ముందుకు దూసుకు పోవాలి అని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకకొని స్నేహపూరిత వాతావరణం ఏర్పడాలని అన్నారు.కొత్త విధానంతో ఈ క్రికెట్ టోర్నీ నిర్వహించినటువంటి నిర్వహణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిఐ అశోక్, సర్పంచ్ కాపుల కృష్ణ, జడ్పిటిసి ఇర్పా శాంత,ఎంపీపీ కోదండ రామయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సొయం రాజారావు, యూత్ అధ్యక్షులు కాకి అనిల్, ఈశ్వర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.
