UPDATES  

 శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం : జీఎం జి. వేంకటేశ్వర రెడ్డి

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 21
మణుగూరు పివి కాలనీ, సింగరేణి కాలరీస్ సిఈఆర్ క్లబ్ ప్రాంగణంలో ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై జీఎం కార్యాలయంలో శనివారం ఏరియా జనరల్ మేనేజర్ జి వేంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో జీఎం జి. వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ,లోకకల్యాణార్థం భక్తుల యాదోచిత సహాయ సహకారాలతో మన సింగరేణి పీవి కాలనీ ఏరియా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వేద మంత్రాల మధ్య ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగించడం జరుగుతుంది అన్నారు.ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుటకు,సింగరేణియులు వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ,పరిసర గ్రామాల నుండి విచ్చేసే అశేష భక్తజనులకు,సకల సౌకర్యాలు కల్పించుటకు నిధుల అవసరం ఎంతో ఉంది కావున ఏరియా ఉద్యోగుల నుండి విరాళాల రూపంలో నిధులు సేకరించటం లో అన్నీ యూనియన్ల నాయకులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని జీ ఎం కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ.టు జియం లలిత్ కుమార్, ప్రాజెక్టు ఆఫీసర్లు నాగేశ్వర్ రావు,శ్రీ లక్ష్మీపతి గౌడ్,శ్రీనివాస చారి,ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి,ఏ జి ఎం సివిల్ వెంకటేశ్వర్లు,డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్,ఇతర ఏరియా ఉన్నత అధికారులు డాక్టర్ శేషగిరి రావు,ఏరియా లోని అన్నీ కార్మిక సంఘాల నాయకులు . టీబీజీకేఎస్ వీరభద్రం,కాప్రా శివాజి ఏఐటియుసి నాగరాజు, వెంకటరత్నం,ఈశ్యర్ రావు,బి ఎం ఎస్,రవీందర్ రావు,నాజర్ పాషా తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !