సీనియర్ పంచాయితీ గుమస్తా వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి..
పార్థివ దేహానికి పూలమాల లేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు..
మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని గుండెపుడి గ్రామపంచాయతీ సీనియర్ గుమస్తాగా సుమారు 32 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ, వెంకటేశ్వర్లు శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ సోనీ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్ తో కలిసి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి పూలమాల లేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత 30 ఏళ్లుగా అధికారులతో, ప్రజా ప్రతినిధులతో ఎంతో సౌమ్యంగా, వినయంగా, నిరాడంబరంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. సూరజ్ వెంకటేశ్వర్లు కు నివాళులు అర్పించిన వారిలో గ్రామ సర్పంచ్ బానోత్ నరసింహారావు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, కాల్లూరి వెంకటేశ్వర్లు, కొమ్మినేని పాండు, చాపల మడుగు రామ్మూర్తి, తదితరులు ఉన్నారు.